హయత్నగర్ : రహస్యంగా పేకాట స్థావరంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.10,470 నగదుతోపాటు 8 సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు, సర్వే నెం.249లో ఓ స్టోర్ రూమ్లో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ శంకరయ్య, సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు.
పేకాట ఆడుతున్న పార్వతి జంగారెడ్డి, జోర్క రాము, నెల్లుట్ల లక్ష్మణ్, ఎర మహేందర్, జాటోగి శ్రీనివాస్, సాదు మధు, యాదగిరి, మాడుగుల చంద్రశేఖర్ గౌడ్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నగదు, సెల్ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు.