కరీంనగర్ : అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు, సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ అధికారులు పక్కా సమాచారంతో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాజీవ్ నగర్ కాలనీలో (AP 22 U 6481), (AP 04 TX 1691) నంబరు గల రెండు డీసీఎం వ్యాన్లలో సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.7,80,000 ఉంటుంది . వాహనాల డ్రైవర్లు మోతే రాము, టేకు సంతోష్ లను విచారించగా రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సిరిగిరి రాజయ్యకు చెందిన వ్యక్తి తమ వాహనాలను కిరాయికి మాట్లాడుకుని బోధన్ ప్రాంతానికి చెందిన ఓ రైస్ మిల్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
రెండు వ్యాన్లను సీజ్ చేసి, ఇద్దరు డ్రైవర్లు, పీడీఎస్ బియ్యం వ్యాపారి సిరిగిరి రాజయ్య లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
Tokyo Olympics: ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మర్