మణికొండ : నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పేకాట ఆడుతుండగా పలువురిని పోలీసులు పట్టుకున్నారు. టాలీవుడ్ హీరోకు చెందిన ఈ ఇంటిని లీజుకు తీసుకుని పేకాట క్లబ్ను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
నగరానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ పేకాట స్థావరాన్ని గత రెండు రోజులుగా నిర్వ హిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు సుమన్కుమార్తో పాటు 29మందిపై కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అన్వేష్రెడ్డి తెలిపారు.
రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మంచిరేవుల వద్ద హీరో నాగశౌర్యకు ఒక విల్లా ఉంది. సుమన్ అనే వ్యక్తి పుట్టినరోజు ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని పేకాట స్థావరం గా మార్చినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో ప్రధాన నింధితుడు సుమన్ పరారయ్యాడు.
దాంతో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో లక్షల్లో నగదు, మొబైల్ ఫోన్లు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నింధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ విల్లాను నాగశౌర్య నుంచి ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది.