సంగారెడ్డి : అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండా వద్ద తుపాకీ కలిగిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు గుర్తించారు. హోండా యాక్టివాపై వచ్చిన ఆ ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆ ఇద్దర్ని సుపారీ హంతకులుగా స్థానికులు భావిస్తున్నారు. భూ వివాదంలో ఒకరిని చంపేందుకు వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇద్దరు దుండగులను అమీన్పూర్ పోలీసులకు అప్పగించారు. వారిద్దరి నుంచి తుపాకీ, ఐదు బుల్లెట్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులు ఉపయోగించిన యాక్టివా నంబర్ – TS 12 EN 9819.