Viral Video | ముంబై : మహారాష్ట్రలోని భివండిలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై ఓ ఆటో అతి వేగంతో దూసుళ్లి డివైడర్ను ఢీకొట్టింది. అయితే రోడ్డు దాటుతున్న యాక్టివాను తప్పించే క్రమంలో.. వేగంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ప్రమాదంలో ఆటో వెళ్తున్న ఐదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VIDEO | Two killed, three injured as auto rickshaw rams into divider in Maharashtra’s Bhiwandi. More details are awaited. pic.twitter.com/wsRzYY6Mnx
— Press Trust of India (@PTI_News) March 9, 2024