అమరావతి : విజయనగరం జిల్లా కెంకాడ మండలం నాతవలస జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన 40 మంది భక్తులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుమలకు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి . ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.