న్యూఢిల్లీ : ఔటర్ రింగ్రోడ్డు భల్స్వా ల్యాండ్ఫిల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ అనంతరం షార్ప్షూటర్ గోగి గ్యాంగ్ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని భగవాన్ సింగ్ అలియాస్ ముఖేష్ (32)గా గుర్తించారు. మేలో షాబాద్ డైరీ ప్రాంతంలో టిల్లు గ్యాంగ్ సభ్యుడి అపహరణ, హత్య కేసులో నిందితుడు ముఖేష్ పరారీలో ఉన్నాడు.
ఔటర్ ఉత్తర ప్రాంతంలో నేరానికి పాల్పడేందుకు ముఖేష్ ఆ ప్రాంతానికి తరచూ వస్తున్నాడనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు సింగ్ను అరెస్ట్ చేశారు. ముఖేష్ పట్టుబడిన తీరును పోలీసులు వివరిస్తూ మంగళవారం మద్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో బెక్పై స్వరూప్ నగర్ నుంచి ల్యాండ్ఫిల్ ప్రాంతానికి వెళుతుండగా వాహనాన్ని ఆపాలని పోలీసులు కోరారు.
పోలీసులు భగవాన్ సింగ్ వాహనాన్ని చుట్టుముట్టి ఆపాల్సిందిగా కోరినా బైక్ను వెనక్కి మళ్లించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు నిలువరించడంతో సింగ్ తన గన్ను బయటకు తీసి పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కాలికి గాయమైంది. ఇక నిందితుడి నుంచి సెమీ ఆటోమేటిక్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.