కావలసిన పదార్థాలు
ఓట్స్: ఒక కప్పు, బియ్యం పిండి: అర కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు,
కరివేపాకు: ఒక రెబ్బ, ఉప్పు: తగినంత, పెరుగు: అర కప్పు, బొంబాయి రవ్వ: ఒక టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము: పావు కప్పు, నూనె: అర కప్పు.
తయారీ విధానం
స్టవ్మీద కడాయి పెట్టి ఓట్స్ను రెండు నిమిషాలు సన్నటి మంటపై వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లుపోసి జారుగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. స్టవ్మీద పొంగనాల పాత్ర పెట్టి నూనె వేడయ్యాక ఓట్స్ మిశ్రమం వేసి రెండువైపులా కాల్చుకుంటే నోరూరించే ఓట్స్ పొంగనాలు సిద్ధం.