కావాల్సిన పదార్థాలు:
తురిమిన కొబ్బరి: 1/2 కప్పు ,
మిరియాలు: 20 గింజలు, పచ్చి మిరప
కాయలు: 3 ఉప్పు: తగినంత,
పెరుగు: అర కప్పు, వామాకు: 2 కప్పులు
తయారు చేసే విధానం:
ముందుగా నూనె లేదా నెయ్యి వేడి చేసుకోవాలి. మిరియాలు, పచ్చి మిరపకాయలు వేసి మిశ్రమం చేయాలి. కొబ్బరి తురుము, వామాకు కూడా వేసి తగిన మోతాదులో ఉప్పు కలపాలి. దీనిని చట్నీలా రుబ్బిన తర్వాత పెరుగు, కొద్దిగా నీళ్లు జోడించాలి. నూనె లేదా నెయ్యి వేడిచేసి దాంట్లో జీలకర్ర, కరివేపాకు, ఎండు మిరపకాయలతో పోపు పెట్టాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమంలో ఈ పోపు వేస్తే రుచికరమైన వామాకు మజ్జిగ రెడీ!