కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు(పెద్దవి), కారం: రెండు టీస్పూన్లు, చాట్ మసాలా: ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తురుము: ఒక టీస్పూన్, బియ్యపుపిండి: ఒక టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఆలుగడ్డలను తొక్కతీసి ఐదు నిమిషాలపాటు ఉప్పునీటిలో నానబెట్టాలి. తర్వాత సన్నగా, పొడవుగా ముక్కలు కోసి నాలుగైదు సార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి. ఒక గిన్నెలో ఆలూ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఒక టీస్పూన్ కారం, అర టీస్పూన్ చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, బియ్యపుపిండి, కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక.. మంట తగ్గించి ఆలూ ముక్కలను విడివిడిగా వేసి, పెద్ద మంట మీద గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. వేగిన ఆలూ ముక్కలను ఒక గిన్నెలో తీసుకుని కారం,చాట్ మసాలా, ఉప్పు వేసి కలిపితే కరకరలాడే ఆలూ కుర్కురే సిద్ధం.