కావలసిన పదార్థాలు
అరటి పండ్లు: నాలుగు, మైదా: ఒక కప్పు, బెల్లం తురుము: పావు కప్పు, తరిగిన కిస్మిస్, కాజు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, యాలకుల పొడి: చిటికెడు, పచ్చికొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు, పసుపు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: చిటికెడు.
తయారీ విధానం
ఒక గిన్నెలో బెల్లం, పచ్చికొబ్బరి తురుము, కిస్మిస్, కాజు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అరటి పండ్లను తొక్క తియ్య కుండానే అడ్డంగా రెండు ముక్కలు చేసి మధ్యలో గింజలు తీసి బెల్లం మిశ్రమం నింపాలి. ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. అరటి పండు తొక్కతీసి మైదా పిండి మిశ్రమంలో ముంచి.. కాగిన నూనెలో దోరగా కాల్చుకుంటే నోరూరించే స్టఫ్డ్ బనానా సిద్ధం.