కావలసిన పదార్థాలు
సజ్జపిండి: ఒక కప్పు, గోధుమ పిండి: అర కప్పు, తరిగిన మెంతి కూర: అర కప్పు, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: రెండు, వాము: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, పసుపు: చిటికెడు, ఆమ్చూర్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సజ్జపిండి, గోధుమ పిండి, వాము, కారం, ఆమ్చూర్, పసుపు, తగినంత ఉప్పు, మెంతికూర తరుగు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లుపోసి చపాతీ ముద్దలా కలిపి అరగంటపాటు మూతపెట్టి పక్కనపెట్టాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని నూనె రాసుకుంటూ పూరీలు ఒత్తుకుని వేడి నూనెలో దోరగా కాల్చుకుంటే సజ్జపూరీలు సిద్ధం. ఆలుగడ్డ కూరతో బాగుంటాయి.