కావలసిన పదార్థాలు
రాగి పిండి: ఒక కప్పు, బియ్యపు పిండి: అర కప్పు, నూనె: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
స్టవ్మీద పాన్ పెట్టి రాగి పిండి, బియ్యపు పిండి వేసి సన్నని మంటపై అయిదు నిమిషాలు వేయించాలి. ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు నీళ్లు, ఒక టీస్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. వేడి నీళ్లను పిండిలో వేసి బాగా కలిపి చల్లారే వరకు పక్కనపెట్టాలి. చల్లారిన పిండిని ముద్దలా చేయాలి. స్టవ్మీద ఇడ్లీ పాత్ర కానీ, గిన్నె కానీ పెట్టి ఆవిరికి నీళ్లు పెట్టాలి. పిండి ముద్దను కొద్దికొద్దిగా తీసుకుని జంతికల గొట్టంలో వేసి ఒత్తుకుని ఆవిరిపై ఉడికిస్తే వేడివేడి రాగి ఇడియప్పం సిద్ధం. ఇష్టపడేవాళ్లు పైనుంచి పచ్చికొబ్బరి చల్లుకోవచ్చు.