కావలసిన పదార్థాలు
బియ్యం: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, మిరియాలు: ఒక టీస్పూన్, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, మినుప పప్పు, శనగ పప్పు: ఒక టీస్పూన్ చొప్పున, జీడిపప్పు: పావు కప్పు, ఎండు మిర్చి: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
బియ్యాన్ని బాగా కడిగి అరగంటపాటు నానబెట్టి పొడిపొడిగా అన్నం వండుకోవాలి. మిరియాలు, ఒక రెబ్బ కరివేపాకు,జీలకర్ర నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి. పాన్లో నెయ్యి వేడయ్యాక ఆవాలు, శనగ పప్పు, మినుప పప్పు, జీడి పప్పు, ఎండు మిర్చి, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాలి. అన్నీ బాగా వేగాక ఉడికించి పెట్టిన అన్నం, వేయించిన మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. పైనుంచి కాస్త నెయ్యి వేసుకుంటే ఘుమ ఘుమలాడే ఆనియన్ పెప్పర్ రైస్ సిద్ధం.