కావలసిన పదార్థాలు
సజ్జలు: ఒక కప్పు, సేమియా: అరకప్పు, బెల్లం: ఒక కప్పు, పాలు: నాలుగు కప్పులు, డ్రై ఫ్రూట్స్: పావుకప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: పావు టీస్పూన్.
తయారీ విధానం
సజ్జలను రెండు నిమిషాలపాటు సన్నని మంటపై వేయించి బాగా కడిగి గంటసేపు నానబెట్టాలి. స్టవ్మీద కడాయి పెట్టి నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమియా కూడా వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో పాలుపోసి బాగా మరుగుతున్న దశలో.. నానబెట్టిన సజ్జలు జోడించి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత సేమియా, తరిగిన బెల్లం వేసి కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ కలుపుకొంటే సజ్జల పాయసం సిద్ధం.