కావలసిన పదార్థాలు:
మామిడి చిగురు: అర కప్పు, చిన్న ఉల్లిపాయలు: అర కప్పు, పచ్చికొబ్బరి తురుము: అర కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఎండు మిర్చి: రెండు, అల్లం: చిన్న ముక్క, ఉప్పు: తగినంత, కరివేపాకు: ఒక రెబ్బ, పోపు గింజలు: అర టీ స్పూన్, నూనె: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం:
ముందుగా మిక్సీ జార్లో మామిడి చిగురు, ఉల్లి పాయలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్మీద కడాయి పెట్టి ,నూనె వేసి వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి, వేగాక పోపును పచ్చడిలో కలిపితే సరి. మామిడి చిగురు పచ్చడి రెడీ.