కావలసిన పదార్థాలు
మటన్ కీమా: అర కిలో, ఉల్లిగడ్డలు: రెండు (పెద్దవి), గసగసాలు: ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు: పది, నూనె: ఒక కప్పు, లవంగాలు: నాలుగు, మిరియాలు: పది, యాలకులు: రెండు, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, జాజికాయ పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, సాజీర: అర టీస్పూన్, కుంకుమపువ్వు: చిటికెడు.
తయారీ విధానం
స్టవ్మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వెయ్యాలి. బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు జోడించి.. సన్నని మంటపై వేయించాలి. ఎర్రగా వేగాక జీడిపప్పు, గసగసాలు వేసి మరో అయిదు నిమిషాలు వేయించి చల్లార్చాలి. మిక్సీ జార్లో ఉల్లిగడ్డ మిశ్రమం, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, సాజీర, కుంకుమ పువ్వు వేసి మెత్తగా గ్రైండ్ చేసి, మటన్ కీమా కూడా వేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చెయ్యాలి. మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్మీద పాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి.. వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పొడవుగా కబాబ్స్లా చేసుకుని సన్నని మంటపై షాలో ఫ్రై చేసుకుంటే కకోరీ కబాబ్ సిద్ధం. మిశ్రమాన్ని కడ్డీలకు పెట్టి గ్రిల్ కూడా చేసుకోవచ్చు.