UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినవాళ్లకు ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే వెల్లడించనుంది. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైనవాళ్లకు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16 నుంచి 25వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2 నింపి, యూపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మెయిన్స్ రాసిన అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in.లోకి వెళ్లి తమ రిజల్ట్ చెక్ చేసుకోవాలి. యూపీఎస్సీ హోమ్ పేజీలో మెయిన్స్-2022 ఫలితాల లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ వస్తుంది. పీడీఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కులను బట్టి ఆలిండియా సర్వీసులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ ముందుగా 861 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పోస్టుల సంఖ్యను 1011కు పెంచింది. దాదాపు 13 వేల మంది మెయిన్స్ ఎగ్జామ్ రాశారు.