బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు కొంతమంది సెలెబ్రిటీలు. అదే జాబితాలోకి వస్తుంది సీనియర్ హీరోయిన్ జీనత్ అమన్. ‘దమ్ మారో దమ్..’ అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించిన అలనాటి తార జీనత్.. సోషల్ మీడియాలో తాజాగా చేసిన పలు కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వయసులో ఉన్న వాళ్లు ఫీలింగ్స్ను కాస్త కంట్రోల్ చేసుకోవాలని చెప్పింది.
తాజాగా ఆమె చేసిన కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపాయి. ‘ఇంతకుముందు ఎక్కడా చెప్పని విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే వెంటనే పెండ్లి చేసుకోవద్దు. వారితో కొన్నాళ్లు సహజీవనం చేయండి. ఆ తర్వాత అన్నీ బాగుంటే పెండ్లి చేసుకోండి. నా ఇద్దరు కొడుకులకు ఇదే చెప్పాను. రెండు కుటుంబాలు ఒకే కుటుంబంగా మారే ముందు కొన్నాళ్లు కలిసి ఉండండి.
మీ ప్రేమకు మీరే టెస్ట్ పెట్టుకోండి. కలిసి ఉండగలుగుతున్నారా లేదా అనేది తెలుసుకోండి. కొన్ని గంటలు సరదాగా మాట్లాడుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. కానీ, ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండగలరా? మీరు బాధలో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి నుంచి మీరు కోరుకున్న ఓదార్పు లభిస్తుందా? కోరుకున్నట్టుగా వండి పెట్టగలరా? బెడ్ రూమ్, బాత్ రూమ్ అన్నీ షేర్ చేసుకోగలుగుతున్నారా? ఈ విషయాలన్నిటిపైనా మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏడడుగులు వేయండి’ అని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది జీనత్.