టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రి బెడ్ ఎక్కడం ఆందోళన కలిగస్తుంది. వినాయక చవితి రోజు సాయి ధరమ్ తేజ్ బైక్పై నుండి కింద పడి గాయాల పాలయ్యాడు.అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. రీసెంట్గా నేనొచ్చేస్తున్నా… అంటూ థమ్సప్ ఫోటోను షేర్ చేసి అందరిలో ఆనందాన్ని నింపాడు.
ఇక డెంగ్యూ ఫీవర్ వలన అడివి శేష్కి ప్లేట్ లెట్స్ పడిపోవడంతో ఆయన ఆసుపత్రిలోఅడ్మిట్ అయి రెండు వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. రీసెంట్గా తాను ఇంటికి వచ్చిన విషయాన్ని తెలియజేశారు. ఇక బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా షూటింగ్లో గాయపడ్డారు. మహాసముద్రం అనే సినిమా షూటింగ్ సమయంలో గాయం కావడంతో.. సిద్ధార్థ్ విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. సర్జరీ పూర్తి కావడంతో తిరిగి ఇండియాకి వచ్చాడు.
ఇక తాజాగా హీరో రామ్ రాపో 19 కోసం జిమ్లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్న క్రమంలో రామ్ గాయపడ్డాడని తెలుస్తుంది. కొన్ని వారాల పాటు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన మళ్లీ మన ముందుకు వస్తానని ట్వీట్ చేశాడు. ఇలా వరుసగా యువ హీరోలు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతుండడం అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది.