యువ హీరో పంజా వైష్ణవ్తేజ్ ప్రస్తుతం తన నాలుగో చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల నాయికగా కనిపించనుంది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఎస్. నాగవంశీ. ఎస్. సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని కీలక పాత్రకు నటి అపర్ణా దాస్ను ఎంపిక చేసినట్లు తాజాగా చిత్రబృందం వెల్లడించింది.
‘మనోహరం’, ‘బీస్ట్’ వంటి చిత్రాలతో మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో అపర్ణ వజ్ర కాళేశ్వరి దేవి పాత్రలో కనిపించనుంది. కథలో ఈ పాత్ర కీలకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.