Yevam Movie | టాలీవుడ్ యువ నటులు చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి కన్నడ నటుడు యుగంధర్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘యేవమ్’. నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక విడుదల దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఒగ్గు కథను స్పూర్తిగా తీసుకోని ఒక పాటను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పాట చూస్తే.. కథలో వచ్చే ఓ కీలక సన్నివేశాలను గాఢతను, సారాంశాన్ని ఒగ్గుకథ రూపంలో చెప్పినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వికారాబాద్ లో వరుసగా హత్యలు జరుగుతుండగా.. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ ప్రాంతంలో పోలీస్ గా జాయిన్ అవుతుంది చాందిని. మరి ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనేది చివరకి చాందిని పట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.