Yatra 2 | ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి (YS. Rajashekar) కొడుకు ఏపీ సీఎం జగన్ (Cm Jagan) జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం రానుంది. మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్తో పాటు, టీజర్, ఫస్ట్ సింగిల్ను విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
యాత్ర 2 నుంచి తొలి సమరం అనే సెకండ్ సింగిల్ను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక ఓదార్పు యాత్రలో ఉన్న ఈ తాజా లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
.#TholiSamaram ~ A leader’s fight for his people! ✊#Yatra2 Second Single will be out tomorrow @ 11:00 AM! 🤩
A @Music_Santhosh Musical 🎹#LegacyLivesOn #Yatra2OnFeb8th @mammukka @JiivaOfficial @ShivaMeka @ramjowrites @gowthambharadwj @MahiVraghav @madhie1 #SelvaKumar… pic.twitter.com/x9RRlvG5ix
— BA Raju’s Team (@baraju_SuperHit) January 29, 2024
వైఎస్. రాజశేఖర్రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం ఇలా ప్రతిది 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాల చుట్టూ ఈ సినిమా సాగనుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.