షేక్స్పియర్ రచనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘యానం’. కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ పతాకంపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మిస్తున్నారు. కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర హీరోహీరోయిన్ల ఫస్ట్లుక్ పోస్టర్స్ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో కల్యాణ్, రేణుశ్రీ నాయకానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్ని పోషించబోతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. ‘సరికొత్త ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. కథ, కథనాలు వైవిధ్యంగా సాగుతాయి’ అని దర్శకుడు తెలిపారు. వినూత్న కథా చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోహీరోయిన్లు చెప్పారు.