టాలీవుడ్కు ఊపు తెచ్చి, కరోనా తర్వాత పెద్ద సినిమాలు రిలీజవవడానికి మార్గం సుగమం చేసిన చిత్రం ‘అఖండ’. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో హీరో బాలకృష్ణ సహా చిత్ర బృందం అంతా కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంది.
సోమవారం అఖండ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి అఖండ సినిమా టీమ్తో కలిసి యాదాద్రిని సందర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.