Writer Padmabhushan Movie | ఒకప్పుడు సినిమా రిలీజవుతుందంటే అందులో తెలిసిన మొహాలో దర్శకుడినో దృష్టిలో పెట్టుకుని సినిమాలకు వెళ్లేవారు. కొన్ని సినిమాలకు మాత్రం టాక్ బాగా వచ్చిన తర్వాత వెళ్లేవారు. అది కూడా రెండు, మూడు వారాల తర్వాత. కానీ ఇప్పుడు అలా లేదు. హీరో ఎవరా? దర్శకుడు ఎవరా? అని ఆలోచించడం లేదు. కంటెంట్ కొత్తగా ఉంటే చాలు థియేటర్లకు ఎగబడిపోతున్నారు. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై తిరుగులేని విజయాలు నమోదు చేశాయి. ఇటీవలే రిలీజైన రైటర్ పద్మభూషణ్ కూడా అంతే. పోటీగా పాన్ ఇండియా సినిమా మైఖేల్ విడుదలైనా.. ప్రేక్షకులు రైటర్నే గెలిపించారు.
యూట్యూబ్లో షార్ట్ ఫిలింస్ చేస్తూ కెరీర్ను ప్రారంభించిన సుహాస్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాడు. ఇక కలర్ ఫోటోతో అనూహ్యంగా హీరోగా మారి తొలి అడుగులోనే విజయం సాధించాడు. అయితే కలర్ఫోటో ఓటీటీలో రావడం, పైగా కరోనా టైమ్ కావడంతో ఎక్కువ మందికి రీచ్ అయింది. అదే రైటర్ పద్మభూషణ్కు ప్లస్ అయింది. దాంతో పాటు చిత్రబృందం కూడా ప్రమోషన్లు జోరుగా జరపడంతో రిలీజ్కు ముందే రైటర్పై మంచి బజ్ ఏర్పడింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతూ పది రోజుల్లో పది కోట్లు వసూళ్ చేసింది. రూ.2.50 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటివరకు రూ.6 కోట్ల వరకు షేర్ను సాధించి డబుల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక్కడే అనుకుంటే యూఎస్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
తెలిసిన కథే అయినా.. ఆ కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ వందకు వంద మార్కులు కొట్టేశాడు. కామెడీ, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ సినిమాలో బాగా వర్కవుట్ అయింది. పైగా ఇటీవలే మహిళల కోసం ఉచిత షోలు వేయడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ రోజు వాలైంటెన్స్ డే కావడంతో టిక్కెట్లు మరింత తెగే చాన్స్ ఉంది. సుహాస్ అటు ఓటీటీలోనూ, ఇటు థియేటర్లోనూ మొదటి అడుగులోనే విజయభేరి మోగించాడు.