‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో పరభాషల్లో ఆకట్టుకున్న చిత్రం ‘పుష్ప’. అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో కాసుల వర్షం కురిపించింది. ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే హిందీలో వంద కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. సుకుమార్ టేకింగ్, విజన్కు సినీప్రముఖులు సైతం జైజైలు కొట్టారు. బన్నీ నటన, అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఫస్ట్పార్ట్లో కాసేపు మాత్రమే కనిపించిన ఫాహద్ సెకండ్ పార్ట్లో ఎంతటి విలనిజంను పండిస్తాడో?, బన్నీతో గొడవలు ఎంత వరకు దారి తీస్తాయో? స్మగ్లర్గా బన్నీ ఏ స్థాయికి వెళ్తాడో ? అని ప్రేక్షకులు క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక పాత్ర గురించి ట్విట్టర్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొదటి పార్ట్లో రష్మిక, శ్రీవల్లి పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. అయితే సెకండ్ పార్ట్లో రష్మిక చనిపోతుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. బన్నీపై పగ తీర్చుకోవడం కోసం విలన్లు రష్మికను చంపుతారని టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి టర్నింగ్ పాయింట్ కూడా అదే అవుతుందని సమాచారం. ఇక సుకుమార్ కూడా తన సినిమాలలో ఎమోషన్కు పెద్ద పీట వేస్తుంటాడు. ఇప్పటివరకు సుక్కు తెరకెక్కించిన సినిమాలలో ఎమోషనల్ సీన్లు కీలకపాత్ర పోషించాయి. పుష్ప-2లో కూడా రష్మిక చనిపోవడం సినిమాలో కీలకపాత్ర వహిస్తుందని ట్విట్టర్లో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం స్క్రిప్ట్ తుదిదశలో ఉన్న ఈ చిత్రం అగస్టులో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రంలో దిశా పటానీ ఓ స్పెషల్ సాంగ్లో నర్తించనుందని సమాచారం. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర మొదటి భాగంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టీ మీడియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘పుష్ప’ రూ.365కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.