Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న మెగాస్టార్ కెరీర్ 158వ చిత్రం నేడు ఘనంగా ప్రారంభమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత కే వెంకట నారాయణ తెలుగులో తన తొలి ప్రాజెక్ట్గా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని చిత్ర బృందం ఎంతో వైభవంగా నిర్వహించింది. టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు, సినీ పెద్దలు ఈ వేడుకకు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా వచ్చిన అప్డేట్స్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరవుతారని వార్తలు రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా మెగా అభిమానులు చిరంజీవి-చరణ్- పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించే క్షణాల కోసం ఆసక్తి చూపించారు. కానీ అనూహ్యంగా ఈ వేడుకలో రామ్ చరణ్ కనిపించకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో “చరణ్ ఎందుకు రాలేదు?” అనే చర్చ మొదలైంది. ఆయన గైర్హాజరుకు అసలు కారణం ఏమిటన్న దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో వరుస ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన షెడ్యూల్ కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయి ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. అయితే రామ్ చరణ్ కూడా ఈ వేడుకలో పాల్గొని ఉంటే మెగా అభిమానులకు అది మరింత ప్రత్యేక క్షణంగా నిలిచేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మెగాస్టార్ కొత్త సినిమా ప్రారంభం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఇక మెగాస్టార్ 158వ చిత్రం కథ, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలపై త్వరలో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు మేకర్స్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.