Mamta Kulkarni | ఉత్తరప్రదేశ్(UP) అలహాబాద్లోని ప్రయాగ్రాజ్(Prayagraaj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మాజీ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి(Mamta Kulkarni) సన్యాసం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 24న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్ (Mahamandelshwar)గా మారుతున్నట్లు ప్రకటించింది. తన జీవితం దేవుడికి అంకింతం ఇస్తూ.. ఇక నుంచి ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించాలి అనుకుంటున్నా అంటూ చెప్పుకోచ్చింది. ఈ సందర్భంగా తన పేరును శ్రీ యామై మమతా నందగిరిగా మార్చుకుంది. అయితే మమతా సన్యాసిగా మారడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. తన భర్త మీద.. తన మీద ఉన్న డ్రగ్స్ కేసు నుంచి పూర్తిగా బయటపడడానికే మమతా సన్యాసం నాటకం వేస్తుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే మమత ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో ఇరుక్కుంది అనేది చూసుకుంటే..?
మమతా కులకర్ణి కెరీర్ గ్రాఫ్
1990లో కరణ్ అర్జున్, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి సినిమాలలో తన గ్లామరస్ రోల్స్తో గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. అయితే తన కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్(Under world DOn Chota Raajan)తో కులకర్ణికి సంబంధం ఉంది అనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో మమతా యాక్టింగ్ కెరీర్ నుంచి దూరంగా విదేశాలకు పారిపోయింది.
భారత్ నుంచి వెళ్లిన దాదాపు 16 ఏండ్ల అనంతరం కెన్యాలో 2016లో జరిగిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు బయటపడింది. రూ. 2000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల రాకెట్ను మమతా భర్త విక్కీ గోస్వామి (Vicky Goswamy) నడిపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో విక్కీ గోస్వామితో పాటు మమతాను అరెస్ట్ చేశారు కెన్యా పోలీసులు. ఇదే కేసుపై ఇండియాలో కూడా ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కేసులో 2017లో బెయిల్ మీద బయటకు వచ్చింది మమతా.
ఇండియాలో మమతా కులకర్ణిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అవ్వగా.. 2020లో ఈ కేసుపై బాంబే హైకోర్టు స్పందిస్తూ.. ఆమెకు మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో నేరుగా సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంటూ రెడ్ కార్నర్ నోటీసును కొట్టివేసింది. దీంతో మాదకద్రవ్యాల కేసులో నిర్దోషిగా తేలిన తర్వాత మమతా కులకర్ణి 2024లో భారతదేశానికి తిరిగి వచ్చింది. అయితే తన భర్త విక్కీ గోస్వామి గురించి మీడియా ప్రశ్నించగా.. నాకు అతడికి సంబంధం లేదంటూ.. అతడి నేర కార్యకలాపాల గురించి తెలుసుకున్న తర్వాత అతని నుంచి దూరంగా ఉన్నానని పేర్కొంది.
తాజాగా 2025 మహా కుంభమేళలో సన్యాసం పుచ్చుకుని మహామండలేశ్వరుడిగా మారుతున్నట్లు ప్రకటించింది. అయితే మమతా ఇలా మారాడానికి గల కారణం తన మీద ఉన్న కేసులు అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికే.. సన్యాసిగా మారిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.