సంక్రాంతి కానుకగా విడుదలైన కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కోలీవుడ్ భామ ప్రియాభవానీ శంకర్. అనిల్ కుమార్ అల్ల డైరెక్షన్లో సంతోష్ శోభన్ (Santhosh Soban) హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ప్రియా భవానీ శంకర్ డబ్బు సంపాదించేందుకు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై స్పందించింది ప్రియా భవానీ శంకర్. తానెప్పుడూ అలా చెప్పలేదని గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చింది. అందరూ డబ్బు కోసమే పని చేస్తారని, ఎవరు చేయరని ప్రశ్నించింది. ఒకవేళ తాను అలా చెప్పినా పెద్ద విషయమేమి కాదని పేర్కొంది. ఈ విషయంలో యాక్టర్లను టార్గెట్ చేశారంటూ నిరాశ వ్యక్తం చేసింది. తానిక్కడివరకు ఎదిగేందుకు చాలా కష్టపడ్డానని, ఎవరినైనా అంత సులభంగా అనేందుకు తాను ఒప్పుకోనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సుదీర్ఘమైన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రియాభవానీ శంకర్ తెలుగులో సత్యదేవ్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2లో కీలక పాత్రలో నటిస్తోంది. మరో ఐదు సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.