దక్షిణాది అగ్ర కథానాయికల్లో నయనతార పంథాయే వేరు. దాదాపు పదేళ్లుగా ఆమె సినిమా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నది. కెరీర్ ఆరంభంలో ప్రమోషన్స్కు విధిగా హాజరైన ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత వాటికి దూరంగా ఉంటున్నది. దక్షిణాదిలో ఆమెకున్న పాపులారిటీ కారణంగా దర్శకనిర్మాతలు కూడా ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవడం లేదు. తన భర్త విఘ్నేష్ శివన్ నిర్మించే చిత్రాల ప్రమోషన్స్లో మాత్రమే నయనతార పాల్గొంటున్నది.
ప్రచార కార్యక్రమాల విషయంలో ఎన్నో ఏండ్లుగా తాను పాటిస్తున్న నియమాలను ‘జవాన్’ సినిమా కోసం ఈ భామ బ్రేక్ చేయబోతున్నట్లు తెలిసింది. తాను నటించిన తొలి హిందీ చిత్రం ఇదే కావడంతో పాటు షారుఖ్ఖాన్ తన అభిమాన నటుడు కావడంతో నయనతార ప్రచార కార్యక్రమాలకు అంగీకరించిందని తెలిసింది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకానుంది.