Pawan Kalyan | ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న పొజిషన్ లో ఆయన నుంచి సినిమా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది అత్యాశే అవుతుంది. ఆ విషయం అభిమానులకు కూడా బాగా తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి వాళ్ళు ఏమీ అడగడం లేదు. కేవలం ఆయన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బాగా పర్ఫార్మ్ చేస్తే చాలు అని కోరుకుంటున్నారు. ఈసారి అయినా ఆయనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే బాగుంటుందని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆ దేవుడిని కోరుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఎన్నికల తర్వాతే పవన్ మళ్ళీ కెమెరా ముందుకు రావాలని ఆలోచిస్తున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే పక్కా ప్రణాళిక కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. తనతో సినిమాలకు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు కూడా ఇదే విషయం క్లారిటీగా చెప్పాడు పవన్. తనకోసం వెయిట్ చేయాల్సిన పనిలేదని.. అవకాశం ఉంటే ఇతర హీరోలతో సినిమాలు చేసుకునే వెసలు బాటు కూడా కల్పించాడు పవన్ కళ్యాణ్. అందుకే హరీష్ శంకర్.. రవితేజతో ఈ మధ్య మిస్టర్ బచ్చన్ సినిమా మొదలు పెట్టాడు. ఇక క్రిష్ కూడా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. దానికోసం నయనతార, అనుష్క శెట్టిలలో ఎవరో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
మరొకవైపు సుజీత్ మాత్రం ఓజి నుంచి బయటకు రావాలి అనుకోవడం లేదు. ఆ సినిమా పూర్తిగా వేరే సినిమా గురించి ఆలోచించాలని ఈ కుర్ర దర్శకుడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ షెడ్యూల్స్ గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడు. ఎన్నికల తర్వాత పవన్ ముందుగా పూర్తి చేసే సినిమా ఇదే. ఎందుకంటే దీని షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. కేవలం రెండు వారాలు షూటింగ్ చేస్తే మొదటి భాగం పూర్తవుతుంది. ఆ తర్వాత సీక్వెల్ కూడా వీలు చూసుకుని మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు సుజిత్. అన్ని కుదిరితే ఏప్రిల్ తర్వాత ఓజి సెట్స్ కు రానున్నాడు పవన్ కళ్యాణ్. ఈలోపు రవితేజ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు హరీష్ శంకర్. ఇక క్రిష్ హరిహర వీరమల్లు సంగతి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ సినిమా అప్డేట్స్ ఆగిపోయి చాలా కాలం అయిపోయింది.