ప్రయోగాత్మక చిత్రాలతో బాలీవుడ్లో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనురాగ్కశ్యప్ తన వ్యక్తిగత వైఫల్యాల వెనకదాగివున్న భయంకరమైన వాస్తవాల్ని వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో కొందరు తనను టార్గెట్ చేశారని చెప్పారు. తన కూతురిని అత్యాచారం చేస్తామని బెదిరించడంతో ఆందోళనకు గురై డిప్రెషన్లోకి వెళ్లానని తెలిపారు.
‘అత్యాచార బెదిరింపులతో నా కూతురు భయభ్రాంతులకు గురైంది. ఆమె పరిస్థితి చూసి నేను కలత చెందా. ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదని కుటుంబంతో పోర్చుగల్ వెళ్లిపోయా. ఇండియాకు రాగానే కరోనా మొదలైంది. దాంతో నా సినిమాలన్నీ ఆగిపోయాయి. ఈ సమస్యలన్ని చుట్టుముట్టడంతో ఒత్తిడిని తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ కష్టాల నుంచి కోలుకుంటున్నా’ అని అనురాగ్ కశ్యప్ తెలిపారు.