చెన్నై: ఈ ఏడాది తమిళనాడులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సినీ హీరో దళపతి విజయ్ సన్మానించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు 10వ తరగతి టాపర్లు, ముగ్గురు ఇంటర్మీడియట్ టాపర్లకు విజయ్ సన్మానం చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
తమిళ నటుడు దళపతి విజయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. రాష్ట్రంలోని తన అభిమాన సంఘాల ద్వారా సమాజానికి సేవ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది తమిళనాడులోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10వ తరగతి టాపర్లు ముగ్గురు, ఇంటర్మీడియట్ టాపర్లు ముగ్గురు చొప్పున ఆరేసి మందిని చెన్నైకి పిలిపించుకుని సన్మానించారు. విద్యార్థులందరికీ శాలువాలు కప్పి సత్కరించారు. ప్రోత్సాహక సర్టిఫికెట్లను అందజేశారు.
కాగా, ఈ సన్మాన కార్యక్రమానికి ఎలాంటి హంగులు, ప్రచార ఆర్భాటాలు వద్దని నటుడు విజయ్ ముందే తన అభిమానులకు చెప్పారు. ప్రచారం కోసం ఎలాంటి హంగామా చేయకుండా నిరాడంబరంగా కార్యక్రమం జరిగేలా చూడాలని కోరారు. దాంతో విజయ్ కోరుకున్నట్టే ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇతర ఆర్భాటాలు లేకుండా అభిమానులు కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.
#WATCH | Tamil Nadu: Actor Vijay felicitates the top three toppers of Class 10 and 12 board examinations of each constituency of the state, at the RK Convention Center in Chennai pic.twitter.com/R9y69I8R1G
— ANI (@ANI) June 17, 2023