Vyooham Movie Teaser | నెలన్నర క్రితం రిలీజైన వ్యూహం టీజర్ ఎంత పెద్ద సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్లో హీట్ పెంచే విధంగా అనిపించింది. బయోపిక్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఇప్పటికే ఎందరో బయోపిక్లు తీసి సక్సెస్ అయిన ఘనత ఆయనది. రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే ఆయన ఏ బయోపిక్ తీసిన కాంట్రవర్సీ క్రియేట్ అవడం పక్కా. ఇక ఇప్పుడు వ్యూహం సినిమాను కూడా అదే యాంగిల్లో కాంట్రవర్సీ క్రియేట్ చేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయ్యేలానే అనిపిస్తుంది. వైఎస్ఆర్ మరణం, జగన్ అరెస్ట్, రాష్ట్రా విభజన, పాదయాత్ర వంటి అంశాలను ప్రధానంగా ప్రసావించినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే అబద్ధం ప్రపంచమంతా ఓ రౌండ్ తిరిగి వస్తుంది అని వచ్చిన డైలాగ్ టీజర్కే హైలైట్గా నిలిచింది. చూస్తుంటే ఈ టీజర్ పెద్ద సంచలనం సృష్టించే విధంగా అనిపిస్తుంది. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో వ్యూహం తొలిపార్టు కాగా, రెండోది శపథం. తొలిపార్టులో YSR మరణం తర్వాత ఏం జరిగిందని, రెండో పార్ట్లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించబోతున్నాడు.
నాలుగేళ్ల క్రితం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఆర్జీవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నికల ఓటమి తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఎలా మారింది. ఆయన జీవితంలోకి పార్వతి ఎలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కాంట్రవర్సీయల్ సబ్జెక్ట్తో పెద్ద దుమారమే రేపాడు. ఈ సినిమా రిలీజ్ టైమ్లో ఏపిలోని చాలా చోట్ల ఈ మూవీ ప్రదర్శననే నిలిపివేశారు. ఇక ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ మరో కాంట్రవర్సీయల్ సినిమా తీసి చాలా మందికి టార్గెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో ‘వ్యూహం’ సినిమాతో ఏపీ పాలిటిక్స్లో హీట్ పెంచడానికి వస్తున్నాడు.