Pavitra Naresh | వీకే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నిర్మించగా..ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా వీకే నరేష్ మాట్లాడుతూ…‘మా సినిమాకు దక్కుతున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషంగా ఉంది.
ఈ విజయాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితం చేస్తున్నాం. వినోదం, సందేశం కలిసిన చిత్రమిది. యువతతో సహా అన్ని వర్గాల వారు చూస్తున్నారు. త్వరలో కన్నడలోనూ సినిమాను విడుదల చేయబోతున్నాం. బతికి ఉన్నంత కాలం సినిమాల్లో నటిస్తూనే ఉంటా. అలాగే మంచి కథలతో సినిమాలు నిర్మిస్తా. సామాజిక సేవ కూడా చేయాలని ఉంది’ అని చెప్పారు. పవిత్ర లోకేష్ మాట్లాడుతూ…‘జీవితానికి సంబంధించిన రహస్యాలు ఎవరూ బయటకు చెప్పరు.
కానీ కొన్నిసార్లు ఆ రహస్యాలను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది సమాజంలో జరిగే కథ అనుకుంటే మేము నిజంగా విజయం సాధించినట్లే. మనమంతా మహిళల్ని గౌరవించాలి’ అన్నారు. సినీ పరిశ్రమలో 50 ఏండ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా వీకే నరేష్కు సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ జ్ఞాపికను అందజేశారు.