Vivek Agnihotri | గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్పీ)లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడంపై జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒక దరిద్రగొట్టు సినిమా అని, వల్గర్గా తీశారని లాపిడ్ విమర్శించారు. ఆయన కామెంట్స్పై పలువురు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, లాపిడ్ వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా స్పందించారు. తన సినిమాలో ఒక్క కల్పిత సన్నివేశం, అవాస్తవ దృశ్యం కానీ ఉన్నట్టు నిరూపిస్తే తాను సినిమాల నుంచి తప్పుకుంటానని లాపిడ్కు సవాల్ విసిరారు. ‘ప్రపంచ మేధావులకు, ఈ మహా గొప్ప ఇజ్రాయెల్ చిత్రనిర్మాతకు ఇదే నా సవాల్. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఒక్క ఫ్రేమ్ కానీ, ఒక్క డైలాగ్ కానీ, ఒక్క ఘటన కానీ అసత్యం అని నిరూపించండి చాలు. నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా’ అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.
లాపిడ్ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే. ఇఫీ జ్యూరీ హెడ్గా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం సిగ్గుచేటు అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ఇలాఉండగా, జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని 53 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు సైతం నిర్ణయించింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని బోర్డు తెలిపింది.
Terror supporters and Genocide deniers can never silence me.
Jai Hind. #TheKashmirFiles #ATrueStory pic.twitter.com/jMYyyenflc— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 29, 2022