Vishwambhara Movie | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏండ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా త్రిష ఒక పోస్ట్ పెట్టింది.
విశ్వంభర సెట్స్లో మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిలతో కలిసి త్రిష ఫొటో దిగి పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోకు దివ్యమైన లెజెండరీలతో కుడుకున్న ఉదయం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ మూవీ సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కుతుండగా యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
A divine and legendary morning indeed!#Vishwambhara 👑🧿 pic.twitter.com/ynXgDVNfuN
— Trish (@trishtrashers) March 21, 2024