Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’ . ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వశిష్ఠ (బింబిసార ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.వాస్తవానికి 2025 సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావల్సి ఉన్నా సమ్మర్కి పోస్ట్ పోన్ చేశారు. కాని అప్పుడు మూవీ రిలీజ్ కాలేదు. కనీసం తర్వాత రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు. అయితే ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన గ్లింప్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వి.ఎఫ్.ఎక్స్ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో నిర్మాతలు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని భావించి మూవీని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
క్వాలిటీ ఔట్పుట్ తోనే సినిమాని జనాల్లోకి వదలాలని భావించారు చిత్ర బృందం. అయితే చిరంజీవి బర్త్ సందర్భంగా మూవీ టీజర్ని ఈ రోజు సాయంత్రం 6.06ని.లకి టీజర్ విడుదల చేయబోతున్నారు. కొద్ది సేపటి క్రితం యూవీ క్రియేషన్ చిన్న వీడియోని విడుదల చేయగా, ఇందులో చిరంజీవి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. మూవీ ఆలస్యానికి కారణం మీకు అత్యున్నత ప్రమాణాలతో, బెస్ట్ క్వాలిటీతో మూవీని మన ముందుకు తీసుకురావాలనే చిత్ర బృందం ఇంత సమయం తీసుకుంటుందని చిరంజీవి అన్నారు. ఇది చందమామ కథలాగా సాగిపోయే అద్భుతమై కథ. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకి ఈ సినిమా బాగా నచ్చుతుంది అని చిరంజీవి అన్నారు. ఇక మూవీని 2026 సమ్మర్కి విడుదల చేయనున్నట్టు చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు.
మూవీ విషయానికి వస్తే.. ఈ చిత్రం భారత పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. “మన పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయని చెబుతారు. యమలోకం, పాతాళం, స్వర్గం వంటి వాటి వరకు సినిమాల్లో చాలామంది చూపించారు. కానీ ‘విశ్వంభర’లో ఆ 14 లోకాలకు మూలమైన ‘సత్యలోకాన్ని’ చూపించబోతున్నాం అని ఇటీవల దర్శకుడు చెప్పుకొచ్చారు. ఈ కథలో కథానాయకుడు ఆ లోకానికి ఎలా వెళ్తాడు? అక్కడి నుంచి కథానాయికను భూమిపైకి ఎలా తీసుకొస్తాడు? అన్న అంశం చుట్టూ సినిమా ఉంటుందని చెప్పాడు. ఇది ఒక రకమైన మిస్టిక్ యాత్రగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్తో అద్భుతమైన సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ప్రతీ సన్నివేశం గొప్ప విజువల్ ఎఫెక్ట్స్తో కూడి ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అందుకే ఇది చిరంజీవి కెరీర్లోనే అత్యంత విజువల్గా రిచ్ సినిమా అవుతుందని భావిస్తున్నారు. చిరంజీవికి జోడీగా త్రిష నటించగా, మరో కీలక పాత్రలో ఆషికా రంగనాథ్ కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పటికీ, ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల కానుంది.
MEGASTAR @KChiruTweets shares a personal note to his fans and the audience about #Vishwambhara ❤️
Check out the MEGA BLAST ANNOUNCEMENT now ⚡
— https://t.co/RQ9is0OQCcLet us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM ❤🔥
MEGA MASS BEYOND… pic.twitter.com/dtJ2Jo0l1m
— UV Creations (@UV_Creations) August 21, 2025