Boo Movie | హార్రర్ జానర్లో తెరకెక్కే సినిమాలకు సినీ లవర్స్ ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. తెలిసిన కథలే అయినా.. కాస్త కొత్తగా, థ్రిల్లింగ్గా చూపిస్తే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తారు. కాగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భూ అనే హర్రర్ సినిమా నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. విజయ్ దర్శకత్వం వహించిన రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. విశ్వక్ సేన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ఓ అపార్టుమెంట్లో ఉండే ఐదుగురు స్నేహితులు దెయ్యాల కథలకు సంబంధించిన బుక్ను చదువుతుంటారు. ఆ తర్వాత వాళ్లందరికి ఎదురుయ్యే పరిమాణాలు ఏంటి అనేది టీజర్లో చూపించారు. ఎక్కిళ్లు వస్తే పక్కనే దెయ్యం ఉంది అని అర్థం వస్తుందన్నట్లు టీజర్లో చూపించారు. రకుల్ ప్రీత్ సింగ్, నివేథా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్, విమలా రామన్ వంటి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ చేసిందో.. ఎప్పుడూ పూర్తి చేసిందో ఎవరికి తెలియదు.
ఐపిఎల్ను ఫ్రీగా అందిస్తున్న జియో సినిమాలో ఈ మూవీ మే 27నుంచి స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఫ్రీగా. ఈ మధ్య జియో సినిమా నార్త్తో పాటు సౌత్ సినిమాలపై కూడా కన్నేసింది. అంతేకాకుండా అందరినీ ఆకర్షించే విధంగా ఫ్రీగా సినిమాలను చూసే వెసలుబాటును కల్పిస్తుంది.