Vishwak Sen | వినూత్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఎమైంది. ఫలక్నూమా దాస్, హిట్ వంటి విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపొతున్నాడు. నటుడుగానే కాకుండా ఫలక్నూమా దాస్ చిత్రంతో దర్శకుడిగా మారి మంచి విజయాన్ని సాధించాడు. ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన పారితోషికం గురించి ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
విశ్వక్సేన్ తన రెమ్యునరేషన్ను రెండింతలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇంతకు ముందు వరకు ఈయన కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకునేవాడట. కాగా అర్జున కళ్యాణం మంచి విజయం సాధించడంతో విశ్వక్ రూ.3 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం ఈయన ఓరి దేవుడా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మలయళం సూపర్ హిట్టయిన ఓ మై కడువలే చిత్రానికి రీమేక్గా తెరకెక్కుంది. దీనితో పాటు దాస్ కా దమ్కి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇటీవలే విడుదలైన చిత్ర టైటిల్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు.