మంచు మోహన్ బాబు పెద్దబ్బాయి మంచు విష్ణు.. ఆలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్గా హాజరు కాగా, ఆ కార్యక్రమంలో పలు విషయాలు వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. మనోజ్తో గొడవ, తన పెళ్లి సమయంలో జరిగిన కొన్నిసంఘటనలు, పిల్లలు కావాలంటే తన భార్య నుండి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియజేశాడు.
వెరోనికాని ప్రేమించిన విషయం తన తండ్రికి చెప్పలేక ఏడాది పాటు ప్రేమాయణం అలానే కొనసాగించాడట. ప్రేమలో ఉన్న సమయంలో తాజ్ కృష్ణ కు రెగ్యులర్ గా వెళ్లి లంచ్ చేస్తుండేవారట. ఒక రోజు తాజ్ కృష్ణలో ఉన్న సమయంలో మోహన్ బాబు రాగా, మేనేజర్ సాయంతో కిచెన్ నుండి బయటకు వెళ్లి పోయినట్టు తెలియజేశాడు. తమ ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో రావడం వల్లే ఇంట్లో తెలిసింది అంటూ మంచు విష్ణు వ్యాఖ్యలు చేశాడు.
పెళ్లికి ముందుగా నాన్న అంత ఆసక్తి చూపలేదు. దాసరి పద్మ గారి మద్యవర్తిత్వం వల్ల తమ పెళ్లి అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె రంగంలోకి దిగి నాన్నకు నచ్చజెప్పడం వల్ల తమ పెళ్లి అయ్యిందని మంచు విష్ణు అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. నలుగురి పిల్లలకు తండ్రిగా ఉన్న మంచు విష్ణు..తనకు ఇంకా పిల్లలు కావాలని ఓ రోజు తన భార్యతో చెప్పాడట, దానికి తన భార్య ఇంకెవర్నైనా చూసుకో పో అంటూ కసురుకుందని.. ఆ ఐడియా కూడా బాగానే ఉందని మంచు విష్ణు కామెడీ చేసాడు. విష్ణు భార్య వెరోనికా.. జగన్ కి దగ్గరి బంధువు. వరసకు ఆమె సీఎంకు సోదరి అవుతారు
మంచు మనోజ్తో గొడవల విషయంపై కూడా ఈ షోలోస్పందించాడు. మనోజ్తో గొడవ అయిందని అనుకుంటున్నారు, అది నిజమేనా అని ప్రశ్నించగా, దానికి స్పందించిన విష్ణు.. పర్సనల్ విషయాలు వాళ్లకెందుకు? ఎందుకు చెప్పాలి వాళ్లకు సమాధానం అంటూ కోపంగా సీటులోంచి లేచి నిలబడ్డారు. ఆ తర్వాత వెంటనే కూల్ అయి అసలు మ్యాటర్ రివీల్ చేశారు.
నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం కాబట్టి నాన్నగారితో కలిసి ఉంటున్నానని, అక్క సపరేట్ ఇంట్లో, తమ్ముడు కూడా సపరేట్ ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు. వాళ్ళు ప్రైవసీగా ఉండడం వాళ్ల వ్యక్తిగత ఇష్టం.. అంతమాత్రాన మాట్లాడటం లేదు, విభేదాలు ఉన్నాయని చెప్పడం కరెక్ట్ కాదని మంచు విష్ణు అన్నారు.