తెలుగు, తమిళ భాషల్లో క్లాస్, మాస్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ యాక్టర్ విశాల్ (Vishal). ఈ హీరో ప్రస్తుతం మార్క్ ఆంటోనీ (Mark Antony) టైటిల్తో ఓ సినిమా చేస్తుండగా..షూటింగ్ దశలో ఉంది. చెన్నై షూటింగ్ షెడ్యూల్లో పాల్గొంటుండగా..ఊహించని ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ ఫైట్ను చిత్రీకరిస్తుండగా విశాల్కు తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది.
చిత్రయూనిట్ వెంటనే విశాల్ను ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశాల్ త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీతూ వర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
మినీ స్టూడియోస్ బ్యానర్పై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. విశాల్ మరోవైపు లాఠీ అనే బైలింగ్యువల్ సినిమాతోపాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు.