సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్నది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 90 దశకంలోని ఓ గ్రామ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అంతు చిక్కని సమస్యలతో బాధపడుతున్న ఆ గ్రామ ప్రజలను కథానాయకుడు ఎలా కాపాడాడు అనేది ఆసక్తికరంగా ఉండనుంది.
మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చావులే..నచ్చావులే..’ లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటను కృష్ణకాంత్ సాహిత్యంలో అజనీష్ లోకనాథ్ స్వరపర్చగా కార్తీక్ పాడారు. నాయకా నాయికల మీద చిత్రీకరించిన ఈ పాట చిత్రానికి ఆకర్షణ అవుతుందని చిత్రబృందం పేర్కొంది.