కోలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ మొదలైంది. అద్భుతమైన చిత్రాలు నిర్మిస్తున్న 2డి ఎంటర్ టైన్ మెంట్స్ కార్తీ హీరోగా విరుమన్ రూపొందిస్తుంది. ఈ సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమానికి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సెప్టెంబర్ 8 నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుండగా, గ్రామీణ నేపథ్యంలో “విరుమన్” ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందబోతోంది. గతంలో కార్తీ, దర్శకుడు ముత్తయ్య కాంబోలో “కొంబన్” మూవీ తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామాలో కార్తీ గ్రామీణ యువకుడిగా కన్పించాడు. ఇప్పుడు కార్తీ, ముత్తయ్య కాంబినేషన్లో విరుమన్ తెరకెక్కుతుండగా, ఈ సినిమా కూడా అలరిస్తుందని అంటున్నారు.
కూతురు డెబ్యూపై శంకర్ స్పందిస్తూ.. ప్రియమైన సూర్య అండ్ జ్యోతిక 2డీ ఎంటర్ టైన్ మెంట్ ప్రై లిమిటెడ్ ని ప్రారంభించి ఎల్లప్పుడూ నాణ్యమైన సినిమాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు! కార్తీ .. దర్శకుడు ముత్తయ్య -రాజశేఖర్ పాండియన్ కి ధన్యవాదాలు. సినీ ప్రేమికులు నా కుమార్తె అరంగేట్రానికి పూర్తిగా సిద్ధమవుతున్నందున తమ ప్రేమతో ముంచెత్తుతారని నేను నమ్ముతున్నాను అని అన్నారు.