పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి కార్యక్రమం అడుగుపెట్టింది. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నారు. బుధవారం విరాటపర్వం చిత్రబృందం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొంది. దర్శకుడు వేణు ఊడుగుల, నటుడు నవీన్ చంద్ర, సినిమాటోగ్రాఫర్ డానీ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ…‘గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎంపీ సంతోష్ గారికి శుభాకాంక్షలు. ‘హరితహారం’, ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.’ అని అన్నారు.