Allu Arjun | పుష్ప సినిమాతో ఇండియా వైడ్ స్టార్ హీరోగా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ తాజాగా ఓ రోడ్ సైడ్ ధాబాలో భోజనం చేశాడు. పక్కనే అతడి భార్య స్నేహ రెడ్డి కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇటీవలే బన్నీ, తన భార్య స్నేహతో కలిసి నంద్యాల వెళ్లిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా వైసీపీ నేత శిల్పా రవిచంద్రరెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లాడు. అయితే ఈ ప్రచారం అనంతరం తిరిగి ఇంటికి ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో ఒక రోడ్ సైడ్ ధాబాలో ఆగి భోజనం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తుంది. టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ సంస్థ మైత్రి మూవీ మైకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సునీల్, అనసుయ, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
#Pushpa in Dhaba! 🥰
Truly heart-warming! ❤️Icon Star #AlluArjun and his wife #AlluSnehaReddy were seen dining at a dhaba, showing his humble side. 🫰🫶#PushpaTheRule #PushpaRaj #Ragalahari pic.twitter.com/ZVfjJBzd0H
— Ragalahari (@Ragalahariteam) May 21, 2024