బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది కంటెస్టెంట్స్తో మొదలు కాగా, ఇందులోఉన్న కంటెస్టెంట్స్ మధ్య బాండింగ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రతి రోజు ఏవో కొట్లాటలు, గోలలు తప్ప సరదాగా ఉన్నట్టు కనిపించడం లేదు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పోటీ పడి మరీ గొడవలకు దిగుతున్నారు. తాజాగా నేటి ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో విడుదలైంది.
ఈ రోజు వినాయక చవితి కావడంతో అందరు ట్రెడిషనల్ దుస్తులు ధరించి తాము తయారు చేసిన వినాయకుడిని పూజించారు. అయితే ఈ వినాయక చవితికి తమ ఫ్యామిలీ మధ్య లేకపోవడంతో చాలా బాధపడ్డారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు. వీడియోలో వారు చాలా బాధపడుతున్నట్టు స్పష్టంగా కనిపించింది.
నటరాజ్ మాస్టర్, లోబో సహా పలువురు కంటతడి పెట్టుకోగా… సడన్గా ఇల్లు ఇల్లులా లేనట్లు అనిపించిందని షణ్ముఖ్ అభిప్రాయపడ్డాడు. అయితే ఓ టాస్క్లో భాగంగా విశ్వ కళ్లకు గంతలు కట్టుకొని కుండలు పగలగొట్టాడు. ఆయనకి శ్రీరామ్ చంద్ర సాయపడ్డాడు.అయితే దీనిపై నటరాజ్ మాస్టర్ మండిపడ్డారు. ‘విశ్వ ఒక్కడికే కండలున్నాయా? అతడు మాత్రమే ఈ టాస్క్ చేయగలుగుతాడా? విశ్వ మాత్రమే కాదు, ఇంకో ఇద్దరినైనా నేను లేపుతాను’ అని యాంకర్ రవి మీద ఫైర్ అయ్యాడు మాస్టర్. ఈ గొడవ వెనక అసలు కారణం ఏందో పూర్తిగా తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.