‘మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే ఆ సినిమాను భుజాలపై మోస్తారు అని చెప్పడానికి ‘విమానం’ సినిమా మంచి ఉదాహరణ’ అన్నారు సముద్రఖని. సముద్రఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘విమానం’ శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్తో కలిసి కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్మీట్ శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ ‘విమానం ప్రేక్షకుల ఆదరణ పొందటం సంతోషంగా వుంది. సినిమాకు ఇప్పుడు థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. చిత్ర దర్శకుడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘కాన్సెప్ట్, కథలోని ఎమోషన్స్తో ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో మౌత్టాక్ కారణంగా వసూళ్లు పెరుగుతున్నాయి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన సుమతి పాత్ర తన కెరీర్లో చిరకాలం నిలిచిపోతుందని అనసూయ భరద్వాజ్ తెలిపారు.