నవీన్ కుమార్ గట్టు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శరపంజరం’. లయ కథానాయిక. దోస్తాన్ ఫిలింస్ పతాకంపై టి. గణపతిరెడ్డి, మల్లిక్ ఎంవీకే నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్, తొలి పాట విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు.
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ…‘అంతరించి పోతున్న మన సమాజపు గత జీవన శైలిని తెరపై ఆవిష్కరించే చిత్రమిది’ అన్నారు. ‘తెలంగాణ మట్టి నుంచి పుట్టిన కథే ఇది. గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమ నేపథ్యంలో నడుస్తుంది. వారు తమ ప్రేమను ఎలా దక్కించుకున్నారు అనేది చూపిస్తున్నాం’ అన్నారు దర్శకుడు.